25 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
తెరిచిన NH 163 జాతీయ ప్రధాన రహదారి.
*ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ*
నేటి గదర్ ప్రత్యేక ప్రతినిధి (ములుగు ):
ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది.
ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ . పి.ఐపిఎస్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ సూచనల మేరకు
అన్ని విధాలుగా పటిష్ట భద్రత చర్యలు తీసుకోనీ NH 163 జాతియ రహదారినీ శనివారం ఉదయం ఏటూరు నాగారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ గారూ ఏటూరు నాగారం సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ రోడ్డు మార్గం గేట్లు ఎత్తివేసి తెరవడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ గత
2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు.
నాటి నుండి నేటి వరకు భద్రత చర్యలలో భాగంగా రోడ్డు మార్గం గేట్లు మూసివేసి దారి మరలించడం . జరిగింది.
కాగా, ప్రస్తుతం ఈ రోడ్డు మార్గం 25 ఏండ్ల తరువాత తిరిగి ప్రజలు వాహనదారుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందీ లేకుండా అభివృద్ధి లో భాగంగా తిరిగి నేడు ఇట్టి NH 163 జాతీయ రహదారిపై గేట్లుఎత్తివేసి
ప్రారంభం చేయడం జరిగింది.
జాతీయ రహదారిపై మూసివేసిన గేట్లు ఎత్తివేయడం తొ ప్రజలు వాహనదారులు. పోలీస్ శాఖ వారికి ప్రత్యేక
ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ అనుముల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









