నేటి గదర్ న్యూస్ : వైరా నియోజకవర్గ ప్రతినిధి.
కొణిజర్ల :కష్టనష్టాలతో పంటలు పండించి పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతుల గోడు పట్టించుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు ఆరోపించారు. శనివారం కొనిజర్ల కళ్యాణ మండపంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, దడి పిన్ని వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర సంఘం కొనిజర్ల మండలం మూడో మహ సభలో వారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారములోకి వచ్చాక రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు వ్యవసాయం మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన అందిస్తున్నాడని వారు విమర్శించారు.రాష్ట్రంలో పంటలు బీమా పథకం లేక రైతులు అంతా నష్టం జరిగి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక అమలు చేయడంలో ముసల కన్నీరు వలపోస్తున్నారని వారు పేర్కొన్నారు.పంట రుణమాఫీ రైతు రైతు భరోసా సంపూర్ణంగా అమలు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు రైతులకు మేలు జరగాలి అని ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంటల మద్దతు ధర గ్యారెంటీ చట్టాలు చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ వ్యవసాయం రైతులను చిన్న సూపు చూడటం వల్లే పల్లె రైతాంగం కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన సంగతి నీ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని వారు సూచించారు.వైరాలో 20వ తారీకు ఖమ్మం జిల్లా రైతు సంఘం మహాసభ జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొండపాటి. రమేష్ కొండపర్తి గోవిందరావు, రాష్ట్ర రైతు సంఘం సీనియర్ నాయకులు అడప రామకోటయ్య,జమ్ముల జితేందర్ రెడ్డి,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్రబాబు, తాటి వెంకటేశ్వరరావు,రైతు సంఘం మండల కార్యదర్శి తండు సోమయ్య,పెద్దమల రత్తయ్య,స్వర్ణ రమేష్, తోట టపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. మహాసభకు ముందుగా రైతు సంఘం జెండాను తాత బాబు పెద్దమల్ల రత్తాలు పతాకాన్ని ఆవిష్కరించారు.
రైతు సంఘం మండల అధ్యక్షుడిగా డేరంగుల లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శిగా తాండు సోమయ్య తోపాటు 15 మంది కార్యవర్గ సభ్యులు, 45 మంది కౌన్సిల్ సభ్యులను మహాసభ ఎన్నుకున్నది.









