+91 95819 05907

మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని రేసులో నాగేందర్ రెడ్డి

అవకాశం ఇస్తే కొత్తతరాన్ని ముందుకు తీసుకొస్తానంటున్న నాగేందర్ రెడ్డి.

మాసాయిపేట మండలం నేటి గద్దర్ (భూపాల్) మార్చ్ 2.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి మండల కమిటీలు పూర్తికాగా మెదక్ జిల్లాలో అందుకు భిన్నంగా కొన్ని మండలాల్లో ఇప్పటివరకు కొత్తగా బిజెపి మండల నాయకులను ఎన్నుకోవడంలో అలసత్వం వహిస్తున్న మెదక్ జిల్లా బిజెపి నాయకత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే ,మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంపీ కార్యాలయం ఉండడం బిజెపి నాయకులకు ఒక గట్టి పునాది. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు కార్యకర్తలలో విభేదాల కారణంగా ఇప్పటివరకు మండల కమిటీ వేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుని ఒంటెద్దు పోకడల కారణంగా బిజెపి కార్యకర్తలు సహకరించకపోవడంతో ఇప్పటివరకు మండల కమిటీ పూర్తి కాలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉండాలని ఓవైపు బిజెపి అధినాయకత్వం నూతన కమిటీలు వేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సాహిస్తూ, ముందుకు తీసుకొస్తుంటే, మెదక్ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో ఇప్పటివరకు పాత నాయకులనే ఉంచడానికి గల కారణం ఏమిటో అర్థం కావడం లేదని, బిజెపి నాయకత్వానికి ప్రతి మండలంలో కొత్త నాయకుల ఎన్నిక ఎంతైన అవసరం ఉందని, కానీ అందుకు భిన్నంగా ప్రస్తుతం ఉన్న పాత నాయకులతో సరిపెట్టుకుందాం అంటే పాత నాయకులతో కలిసి రావడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా లేరని పలుమార్లు జరిగిన మీటింగ్లలో చూసిన విధానమే అందుకు నిదర్శనం. ప్రస్తుతం మండలంలో ఐదు నుంచి పది మంది వరకే మండల కమిటీకి వస్తున్నారని, అది కూడా ఒకటి రెండు ఊర్ల నుండి మాత్రమే బిజెపి కార్యకర్తలు రావడం ఎంత వరకు సమంజసమని, మిగిలిన గ్రామాల్లో నాయకత్వం బిజెపి పై సదభిప్రాయం ఉన్న మాసాయిపేట మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఇప్పటివరకు నూతనంగా గ్రామ కమిటీలు లేకపోవడం ఎవరి నిర్లక్ష్యమో అంతుపట్టడం లేదని ఊహాగానాలు.అందుకే బిజెపి నూతన మండల కమిటీని వేయడానికి ఎవరు కూడా సహకరిస్తున్నట్టు కనిపించడం లేదు. బిజెపిలో అంతర్గత విభేదాలు ఈ మధ్యకాలంలో బయటపడడంతో ఇప్పటికిప్పుడు మండల కమిటీ వేస్తే మండల అధ్యక్షుని పోటీలో పోతంశెట్టిపల్లి గ్రామం చెందిన సీనియర్ నాయకులు నాగేందర్ రెడ్డి పోటీలో ఉండగా అది జీర్ణించుకోలేని ప్రస్తుత మండల అధ్యక్షుడు మండల కమిటీ ఎన్నికను ఇంకా కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపిలోకి వస్తున్న కొత్త తరాన్ని ఆపుతున్నారని ఊహాగానాలు. మాసాయిపేట మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. జిల్లా కమిటీ తక్షణమే స్పందించి మాసాయిపేట మండలం , చేగుంట మండలం,నార్సింగ్ మండలం, మండల కమిటీ లేసి కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవేవీ పట్టనట్టు మండల కమిటీ నాయకులు వ్యవహరించడం వల్ల యువనాయకత్వం బిజెపికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాసాయిపేట మండల కేంద్రంలో మండల కమిటీల్లో ఐదు నుండి పదిమంది మాత్రమే ఉండడం కొత్తవారిని ప్రోత్సహించకపోవడం రెండు వర్గాల మధ్య జరుగుతున్న వర్గ విభేదాలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని పలువురు సీనియర్ బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

ఒక నెల విద్యుత్ బిల్ చెల్లించకుంటే కనెక్షన్ కట్ చేసిన విద్యుత్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 12:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఉప్పరి బస్తికి చెందిన రాజు అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన ఒక నెల కరెంట్ బిల్లు చెల్లించాల్సి ఉంది.కేవలం 500/-

Read More »

ప్రణయ్ హత్య కేసు లో ఎస్సీ , ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం :ఖమ్మం జిల్లా మాదిగ న్యాయవాదుల కో ఆర్డినేషన్ కమిటీ

నేటి గదర్ ప్రతినిధి, ఖమ్మం : 2018వ సంవత్సరం నలగొండ జిల్లాలో సంచలనం సృష్టించిన కులంకార మరణహోమం సంఘటన దళితుడైన ప్రణయ్ అగ్రవర్ణ కులానికి చెందిన అమ్మాయి అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత

Read More »

 Don't Miss this News !