నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి. ఖమ్మం పట్టణంలో గల కరుణగిరి పుణ్యక్షేత్రంలో నేటి నుంచి కరుణగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయినాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా క్రైస్తవ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం మెత్రాసన బిషప్ సగిలి ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజు దివ్య పూజ బలి కర్నూల్ బిషప్ గోరింట్ల జ్వణేష్ ఓసీడ్ తో జరుపబడింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 100 మందికి పైగా పూజ్య గురువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన ఖమ్మం కరుణగిరి మెత్రాసన డైరెక్టర్ మాత్యుస్ దార వరప్రసాద్ ను ఖమ్మం బిషప్ ప్రత్యేకంగా అభినందించారు.
Post Views: 152









