నేటి గదర్ ప్రతినిధి,
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి 18 వరకు సూర్యాపేట జిల్లా కోదాడ లో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన బ్రోచెర్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేసారు . ఈ సందర్భంగా శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల లో మానసిక ఉల్లాసం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా శాఖ మరియు కోదాడ శాఖ లను అభినందించారు . ఈ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ళ సీతారామయ్య , రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు , ఖమ్మం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య , ప్రధాన కార్యదర్శి మేధర మెట్ల సుబ్బయ్య , సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు .









