◆కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తూము వీరరాఘవులు
నేటి గదర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదేంవీరయ్య గారికి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీగా పదవి ఇవ్వాలని నికార్సైన కార్యకర్తగా వీర విధేయుడిగా కాంగ్రెస్ పార్టీలో సిన్సియారిటీగా ప్రలోభాలకు లొంగకుండా కష్టకాలంలో పార్టీని లో ఉండి కార్యకర్తలకు అండగా నిలిచినటు వంటి పొదేంవీరయ్య గారికి సముచితమైన స్థానం కల్పించాలని *కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తూము వీరరాఘవులు అన్నారు. ఆపద కాలంలో పార్టీని వెన్నంటే ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని కాపాడిన వ్యక్తి చివరి క్షణంలో కార్పొరేషన్ పదవి ఇచ్చిన పార్టీ కార్యకర్తలలో నాయకులలో సీనియర్ నాయకులైన వీరయ్య గారికి సరైన న్యాయం జరగలేదని ఉన్నమాట వాస్తవం దీనిపై అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివర్యులు మన రేవంత్ రెడ్డి గారి సహచర మంత్రివర్గం పునర్ ఆలోచించి నికార్సైన నాయకుడికి సరైన గౌరవం కల్పించాలని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తున్నాను అని అన్నారు.









