+91 95819 05907

మున్నేరు నది తీరం అభివృద్ధి మార్గం – భట్టి విక్రమార్క కి ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలు.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి,
15 సంవత్సరాల క్రితం మన ప్రజా నాయకుడు మధిర శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మున్నేరు నది ప్రక్కన రాళ్ల మధ్య, ముళ్ళకంపలు, పొదలను దాటి, కాలిబాట కూడా లేని మార్గంలో పండ్రేగిపల్లి నుండి పెద్దమండవ వరకు నడుస్తూ ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులను తెలుసుకుంటు మున్నేరు నది ఒడ్డున సాగిన పాదయాత్ర.
ఆ మార్గం గుండా వెళ్లడమే ఒక సవాలుగా ఉండేది. కానీ, అభివృద్ధి పట్ల గల సంకల్పం, ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలనే దృఢచిత్తం ఆ రోజు ఒక గొప్ప నిర్ణయంగా మారింది.

ఆ సంకల్పమే నేడు కార్యరూపం దాల్చి, మున్నేరు నదికి ఇరువైపులా పండ్రేగిపల్లి నుండి మల్కాపురం వరకు, గాంధీనగర్ నుండి పోలంపల్లి వరకు బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టేలా మారింది.
భట్టి విక్రమార్క నాయకత్వంలో ఈ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవడం, పనులు వేగంగా సాగుతూ, ముఖ్యంగా పండ్రేగిపల్లి నుండి మల్కాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసినట్టైంది, గాంధీనగర్ టు పోలంపల్లి వరకు రాబోయే 4 నెలల్లో బిటీ రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది.

ఈ రోడ్డు నిర్మాణం ద్వారా గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది. ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయి. విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఒకప్పుడు కష్టసాధ్యమైన ప్రయాణ మార్గం, వర్షం వస్తే నానా ఇబ్బందులు పడుతూ, సైకిల్ మోటార్ మీద వెళుతూ కింద పడిన భయంకరమైన రోజులను రూపుమాపుతూ, నేడు సౌకర్యవంతమైన రహదారిగా మార్చి, అభివృద్ధికి మార్గదర్శకంగా ఈ బాటలు నిలుస్తున్నాయి.

ఈ గొప్ప అభివృద్ధి యజ్ఞంలో ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన భట్టి విక్రమార్క కి ముదిగొండ మరియు చింతకాని మండల ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, మరెన్నో గ్రామాల నవనిర్మాణానికి కారణం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.

భట్టి విక్రమార్క అభివృద్ధికి చిరునామా – కృతజ్ఞతలతో
ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !