+91 95819 05907

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్

నేటి గదర్ వెబ్ డెస్క్:

*2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్​కు దూసుకెళ్లింది.* దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన *సెమీ ఫైనల్​లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.* 265 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో ఛేదించింది. రాహల్ (42*) మ్యాచ్ ముగించాడు. విరాట్ కోహ్లీ (84 పరుగులు) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, అయ్యర్ (45) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో ఆసీస్‌ బౌలర్లలో ఆడమ్ జంపా 2, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ పడగొట్టారు. 265 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ (8) ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (28 పరుగులు), అక్షర్ పటేల్ (27 పరుగులు) ఫర్వాలేదనిపించారు. చివర్లో హార్దిక్ పాండ్య (28 పరుగులు) రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73 పరుగులు), అలెక్స్ కేరీ (61 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ట్రావిస్ హెడ్ (39 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. టీమ్ఇండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2, అక్షర్ పటేల్. హార్దిక్ పాండ్య 1 వికెట్ దక్కించుకున్నారు.
తాజా విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్​కు దూసుకెళ్లింది. ఇక బుధవారం జరగనున్న రెండో సెమీస్​ (న్యూజిలాండ్- సౌతాఫ్రికా) విజేతతో టీమ్ఇండియా ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ వేదికగా జరగాల్సి ఉంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !