+91 95819 05907

మండుటెండలో భిక్షాటన…. ఎందుకో తెలిస్తే కన్నీరు ఆగదు!!!

★న్యాయం చేయండి మహాప్రభో

★నా నౌకరిని నాకు ఇప్పించండి.

★పట్టణంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి భిక్షాటన
నేటి గదర్ న్యూస్,
మణుగూరు : న్యాయం చేయండి మహాప్రభో నా నౌకరిని నాకు ఇప్పించండి అంటూ పట్టణంలోని పూల మార్కెట్ సెంటర్లో మణుగూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఔర్ స్టార్టింగ్ ఉద్యోగి వినూత్నంగా బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉద్యోగం లేకపోతే తన కుటుంబ వీధి పాలు కావటం ఖాయమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2014 సంవత్సరం నుండి మణుగూరు మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన తనకు గత రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరగడంతో ఆరోగ్యం క్షేనించింది. తాను మళ్ళీ కోలుకున్న తర్వాత విధులకు వెళితే అప్పటినుండి ఇప్పటివరకు తనకు పని కల్పించకుండా అనేక రకాలుగా మున్సిపాలిటీ అధికారులు అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఆవేదన చెందారు. ఒకవైపు ఆరోగ్యం బాగాలేక పోవటం, మరోవైపు ఉద్యోగం లేకపోవడంతో తనకు కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. తనకు ఉద్యోగం కల్పించాలని మునిసిపల్ అధికారులను పదేపదే ప్రాధాయపడిన, న్యాయం చేయాలని కమిషనర్లను కోరిన తనను ఇప్పటివరకు వీధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సుమారు ఐదుగురు కమిషనర్లు మారినా తనకు న్యాయం జరగలేదన్నారు. సదర విషయానికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించి కలెక్టర్ గారు కూడా నా ఆరోగ్య పరిస్థితిని గమనించి తనను వీధిలోకి తీసుకోమని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినా కలెక్టర్ గారి ఆదేశాలు పట్టించుకోకపోవడం తనను మరింతగా బాధించిందన్నారు. మరోవైపు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు. ఓ మహిళ అధికారి తనను వికలాంగుడిననీ, మీరు పని చేయరు, మీరు మున్సిపాలిటీ ఉద్యోగానికి పనికిరారు అంటూ తనను మానసికంగా, ఇబ్బంది పెట్టిన ఘటనలు అనేక ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు నాపై, నా కుటుంబం పై దయవుంచి, నాకు న్యాయం చేయగలరని, నా ఉద్యమం నాకు ఇప్పించగలరని, ఈ బిక్షాటన కార్యక్రమం ద్వారా వేడుకుంటున్నాను.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !