నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్ 5: విద్యుత్ షాక్ తో వివాహిత మృతి చెందిన సంఘటన దమ్మపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేటకు చెందిన రంగు కోకిల (29) అనే మహిళ పిల్లలను పాఠశాలకు పంపించే హడావుడిలో వారి బట్టలను ఇస్త్రీ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కి గురై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. చికిత్స కోసం సత్తుపల్లి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Post Views: 434