+91 95819 05907

మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేయాలి టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 5:- గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేయాలని టియుజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు.దీనికి సంబంధించిన కరపత్రాన్ని రామాయంపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ 2011 మార్చి 10 న సీమాంద్ర దోపిడీ పాలన పై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజు అని తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు.తెలంగాణ ఉద్యమ అకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కెసిఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండి పడ్డారు. టియుజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.250 గజాల ఇంటి స్థలం:రూ.30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిపిఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పి.రమేష్ గౌడ్, ఉద్యమకారుల జెఎసి ఎర్ర దుర్గం పంబాల శ్రీనివాస్,జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జ రెడ్డి,లక్ష్మి కాంతమ్మ, పి.లక్మీ,,అన్వర్ పటేల్,టియూకేవి అధ్యక్ష, కార్యదర్శులు పెద్ద యాదగిరి, డోలక్ యాదగిరి, గంగారాం,పి.శ్రీనివాస్, నర్సగల్ల పెద్దస్వామి,చర్చల చంద్రన్న ప్రసాద్, కొమ్ము శంకర్,తాళ్లపల్లి ఎల్లం,కె రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !