రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 6:- ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ బలపరచిన పట్టభద్రులు ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శుభ సందర్భంగా రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట చౌరస్తాలో ఉన్న వివేకానంద విగ్రహం దగ్గర భాజాపా నాయకులు మరియు కార్యకర్తలు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకోని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు,మండల అధ్యక్షులు నవీన్ గౌడ్,పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుపొందడం పట్ల తమ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.గత 10 సంవత్సరాల మోడీ పాలనలో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ఈ తీర్పును ఒక రెఫరడంలా నిలపారని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బిజెపి పార్టీకి దగ్గరై కాంగ్రెస్ పాలనకు విముక్తి కల్పించడం జరుగుతుందని తెలిపారు.కాంగ్రెస్ అన్ని విధాల రైతులను మరియు విద్యార్థులను మరియు యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ,జడ్పిటిసి మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా విజయదుంబిని బిజెపి మోగిస్తుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగి రాములు రామాయంపేట పట్టణ మండల అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, నవీన్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఆకుల రమేష్,ప్రవీణ్ కుమార్,ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్,బిజెపి సీనియర్ నాయకులు వెలుముల సిద్దరాములు,బక్క యాదగిరి,మర్కు వెంకటేశం,నాగరాజు,ఏసి రెడ్డి,రవికాంత్, సంగయ్య,శేఖర్,వెలుముల రమేష్,శంకర్ గౌడ్,భాసం అనిల్,నితిన్,భరత్,ప్రశాంత్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
