+91 95819 05907

సమాచార హక్కు చట్టం తుంగలో తొక్కిన మున్సిపల్ అధికారులు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 6:- సమాచార హక్కు చట్టం కింద సరైన సమాచారం ఇస్తారని మున్సిపల్ అధికారులకు తై బజార్ నిర్వాహకులు దరఖాస్తు పెట్టుకుంటే…సరైన సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఏకంగా తప్పుడు సమాచారం ఇచ్చి సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు…ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం…మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్న తై బజార్ కు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా రామాయంపేట మున్సిపాలిటీ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారని టై బజార్ నిర్వాహకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి,భూమ రమేష్ లు గురువారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము తై బజార్ కు సంబంధించి సమాచారం కోరగా 2015 -2016 సంవత్సరానికి గాను కాంట్రాక్టర్ రూ.6 లక్షల 95 వేలు చెల్లించగా,మున్సిపాలిటీ అధికారులు మాత్రం 7 లక్షల 20 వేలు చెల్లించినట్లు తెలిపారు.అలాగే 2017-2018 సంవత్సరానికి గాను 8 లక్షల 40 వేలు చెల్లించగా మున్సిపాలిటీ అధికారులు 11 లక్షలు చెల్లించినట్లు పేర్కొన్నారు.అలాగే 2018-2019 సంవత్సరానికి గాను 5 లక్షల 61 వేలు చెల్లించగా 10 లక్షల 20 వేల రూపాయలు చెల్లించినట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తప్పుడు సమాచారం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ దేవేందర్ తో పాటు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్,మున్సిపల్ అకౌంటెంట్ శ్రీధర్ రెడ్డి లపై జిల్లా కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !