+91 95819 05907

స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జారె

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 07: దమ్మపేట మండల కేంద్రంలో శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం.స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు వివిధ శాఖల సిబ్బందితో కలిసి నిర్వహించారు. ప్రధాన రహదారిపై రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాలను తొలగించి రహదారిని పరిశుభ్రంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ అందరి భాగస్వామ్యంతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు, పరిశుభ్రత జీవితంలో ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనదని, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యమే కాకుండా మన సమాజం కూడా శుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక సోదరులు కూడా ఎంతో కష్టపడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం కొందరి బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశించిన ప్రదేశాలలో ఉంచి పంచాయితీ సిబ్బందికి సహకరించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఈ నియోజకవర్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !