+91 95819 05907

ఆపదలో ఆపద్బాంధవుడయ్యాడు….కామ్రేడ్. పోతినేని సుదర్శన్ రావు

★ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి

కాపాడి 108 కి సమాచారం అందించిన పోతినేని
నేటిగద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి,
బోనకల్
ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు అదే సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఎర్రిపాలెం వెళ్తున్నారు. రోడ్డుపై తీవ్రంగా గాయపడి ప్రమాదకర పరిస్థితులో ఉండటంతో పోతినేని సుదర్శన్ రావు తన కారుని వెంటనే ఆపి 108 కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి 108 వచ్చేవరకు ఉండి 108 లో ఆ వ్యక్తిని ఎక్కించి ప్రాణాలను కాపాడిన సంఘటన మండల పరిధిలోని రావినూతల, జానకిపురం గ్రామాల మధ్యలో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వైరా బీసీ కాలనీకి చెందిన కాశీమల్ల చార్లెస్ ఇటుక బట్టి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైరా నుంచి తన మోటార్ సైకిల్ మీద కోదాడలో ఇటికబట్టి వద్దకు వెళుతున్నాడు. అయితే మండల పరిధిలోని జానకిపురం – రావినూతల మధ్య ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ కి బ్రేకులు పడకపోవడంతో తనకు తానే రోడ్డుపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి సభ్యులు బండి రమేష్ మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఖమ్మం నుంచి ఎర్రుపాలెం వెళ్తున్నారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న చార్లెస్ ను చూసి వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 వచ్చేవరకు సంఘటన స్థలంలోనే వారు ఉండి అవసరమైన చర్యలను చేపట్టారు. 108 రాగానే స్వయంగా అతనిని పోతినేని సుదర్శన్ రావు, బండి రమేష్, మడిపల్లి గోపాల్ రావు 108 లో ఎక్కించి ప్రాణాల నుంచి కాపాడారు.108 లో చార్లెస్ ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పాలై ప్రమాదకర స్థితిలో ఉన్న చార్లెస్ ని సకాలంలో స్పందించి 108 కి సమాచారం అందించడం వల్లనే ప్రాణాల నుంచి బయటపడినట్లు 108 సిబ్బంది తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !