+91 95819 05907

సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముట్టడి

★గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను తక్షణమే చెల్లించాలి…

★సిఐటియు జిల్లా నాయకులు : సత్రపల్లి సాంబశివరావు.

మణుగూరు మార్చి 7: మణుగూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని,సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాసరావుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా పాలనలో పంచాయతీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆయన ఆరోపించారు.2025 సంవత్సరం జనవరి ఒకటో తేదీ నాటికి పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ మూడు నెలలు కావస్తున్న వేతనాలు చెల్లించకపోవడం వలన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజా పాలన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలను,వేతనాలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లింపు పై రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 19న 149 కోట్ల రూపాయలు విడుదల చేసింది కానీ పంచాయతీల ఎకౌంటు నుండి పంపిన చెక్కులు ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోవడంతో కార్మికులకు వేతనాలు అందని పరిస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల ఎకౌంటు నుండి వేతనాలు చెల్లించేందుకు వీలు లేకుండా పంచాయతీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజింగ్ చేయడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్ టి ఓ కార్యాలయంలో నిలిచిపోయిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ఆయన అన్నారు.ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఒక పూట పని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడిశాల రాములు. సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల వెంకన్న Gp జిల్లా నాయకులు రంగా. సదానందం. వెంకటేశ్వర్లు. పొడుతూరి రాములు. తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

Read More »

మరిన్ని వార్తలు చూడండి :

ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్

నేటి గదర్ న్యూస్,పినపాక: లోక్ అదాలత్ లో అత్యధిక కేసులు పరిష్కరించినందుకు ఎస్ఐ రాజ్ కుమార్,కోర్టు కానిస్టేబుల్ కిషోర్ కు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ గ ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో

Read More »

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లి :సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

*హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ భూముల పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా కామదహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో హోలీ పండుగను పురస్కరించుకొని అంబేద్కర్ రోడ్ లో ఆయా వార్డుల్లో ప్రధాన కూడళ్ళ వద్ద ఇంటింటికి వెళ్లి ప్రజలు పనికిరాని

Read More »

నందగోకుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- విద్యార్థి దశలో ఉపాధ్యాయ వృత్తిని అనుభవించడం గొప్ప అవకాశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ అన్నారు.ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో

Read More »

బీరప్ప జాతర ఉత్సవాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 13:- మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం భాగీర్తిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భీరప్ప జాతర ఉత్సవాలకు మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్

Read More »

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ తో సీఎం భేటి

రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం

Read More »

 Don't Miss this News !