+91 95819 05907

12న వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయండి: భూక్య వీరభద్రం

సమస్యల పరిష్కారానికి ప్రజలు కదిలి రావాలి…

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి, ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయాలి…

సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి మార్చి 9:-వైరా మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12న వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మహా ధర్నాకు సమస్యలతో బాధపడే ప్రజలందరూ కదిలి రావాలని సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. ఆదివారం సిపిఎం బ్రాహ్మణపల్లి శాఖ సమావేశం కొంగర సుధాకర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలీనమైన మున్సిపాలిటీ సమస్యలతో ప్రజలు విలయతాండవం చేస్తున్న ప్రభుత్వాలు అధికారులు సక్రంగా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలకు మున్సిపాలిటీ పరిధిలో పేదలు అనర్లుగా ప్రకటించినది.ఇది సరైనది కాదని పేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12 వేల రూపాయలు పథకాన్ని వర్తింపజేయాలని ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. నియోజక కేంద్రం మరియు మండలాల్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు నిర్మించి, వైరా లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు నివాస ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక దోమలు ఈగలతో ప్రజలు అనారోగ్యాలు పాలవుతున్నారని అన్నారు. ఉన్న ఉపాధి కోల్పోయిన ప్రజలు ఇంటి పన్ను పేరుతో నిర్బంధంగా వడ్డీలతో వసూలు చేయటం ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని తగదని మున్సిపాలిటీ అధికారులు ఈ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సిపిఎం ప్రజల పక్షాన పోరాడుతుందని ప్రజలందరూ కూడా జరిగే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో శాఖ కార్యదర్శి పైడిపల్లి సాంబశివరావు, గుత్తా వాసు, చిట్టూరి నాగేశ్వరరావు, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !