+91 95819 05907

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

★హాజరైన జాతీయ అధ్యక్షులు బి.వి రాజు

భద్రాచలం

దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మహిళల ఆటపాటలతో ఉత్సాహభరిత వాతావరణం లో కొనసాగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వాలను జాతీయ అధ్యక్షులు బివి రాజు జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటపాటలతో మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా 60 సంవత్సరాలు నిండిన మహిళ మూర్తులను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అనంతరం పూజల లక్ష్మీ అధ్యక్షతన జరిగిన మహిళా ప్రతినిధుల సభలో జాతీయ అధ్యక్షులు బివి రాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. దేశంలో రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దాడులకు వ్యతిరేకంగా మహిళ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా మహిళా సాధికారికత కోసం అనేక రూపాలలో సహాయ సహకారాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధానంగా ఒంటరి మహిళలకు అండగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నిలిచి వారి సమస్యలపై వీలైనంతవరకు పనిచేస్తుందని తెలిపారు. మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించడంతోపాటు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు అయిన పూజల లక్ష్మి సంఘాన్ని బలోపేతం చేయడానికి శక్తివంచన లేఖన కృషి చేస్తుందని ఆమె బాటలో మహిళలందరూ పైనుంచి సంఘం అభివృద్ధికి పాటుపడాలని మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ సుఖ సంతోషాలతో గడపాలని ఉద్దేశంతో దిశ ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు అయిన పూజ లక్ష్మికి జ్ఞాపక బివి రాజు అందించారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఐట రీజినల్ సెక్రటరీగా మహమ్మద్ ముజీబ్ ఎన్నిక.

నేటి గదర్ న్యూస్, వైరాప్రతి నిధి, మార్చి 13:-ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల రీజినల్ సెక్రటరీగా కేజీ సిరిపురం ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్

Read More »

మానవత్వానికి నిలువుటద్దం ఈ యువ దంపతులు★బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ యువ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువ

★జన్మ జన్మలకు ప్రజలకు సేవచేసే భాగ్యం కలుగాలి ఉత్తమ సర్పంచ్ అవార్డు గ్రహీత స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు ★ప్రజలకోసం ప్రతిస్పందించే మనుసున్న ప్రజా ప్రతినిధి ★మెదక్ జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా తాజా మాజీ

Read More »

బోరున విలపించిన పోసాని కృష్ణమురళి.

బెయిల్ రాకుంటే నాకు ఆత్మహత్యే దిక్కు జడ్జి ముందు బోరున విలపించిన పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణమురళిని గుంటూరులో జడ్జీ ముందు హాజరు పరిచిన పోలీసులు జడ్జీ ముందు పోసాని బోరున విలపిస్తూ.. నాకు

Read More »

నా పేరు వాడుకుని మా అల్లుడు రమేష్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి భూమిని అమ్మాడు

★బాధితుడు చిట్యాల ఎల్లయ్య ఆవేదన నేటి గదర్ (మెదక్ జిల్లా ప్రతినిధి భూపాల్) మార్చి 12. పూర్తి వివరాల్లోకి వెళ్తే ..మాసాయిపేట మండల కేంద్రంలో గత కొద్దిరోజులుగా సాగుతున్న నకిలీ డాక్యుమెంట్స్ భూ వివాదం

Read More »

48వ డివిజన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతి నిధి, మార్చి12:- నగరంలో బుధవారం స్థానిక 48వ డివిజన్ గణేష్ నగర్ , ఆటోనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మల యుగంధర్ పర్యటించి డివిజన్

Read More »

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది… – జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు… తోటమల్ల రమణమూర్తి. నేటి గదర్ న్యూస్, కొత్తగూడెం,

Read More »

 Don't Miss this News !