రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీ పెద్దమ్మ తల్లి 33వ వార్షికోత్సవం ఈనెల 21న జరుపుతున్న శుభ సందర్భంగా ఈ జాతరకు ఉత్సవాలకు ఆదివారం రోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి లీలా గ్రూప్ చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ హాజరుకావాలని ముదిరాజ్ సంఘం నాయకులు అయనకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది.ఈ జాతర ఉత్సవాలను ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ ముదిరాజ్ సంఘం నాయకులు డాకి స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 90









