+91 95819 05907

మెదక్ లో కోనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహారదీక్షలు

*” ఎస్సీల వర్గీకరణ అమలు చేయకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నియామకలో మాదిగలకు తీవ్ర నష్టం …”*

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 16.

మెదక్ జిల్లా కేంద్రంలో కోనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహారదీక్షలు వర్గీకరణ అమలు కోసం మాదిగ ఉద్యోగస్తులు పోరాటంలో ముందు ఉండాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగ నియమకాలు చేపడితే మాదిగలు తీవ్రంగా నష్టపోతారని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదిగ అన్నారు. మాదిగ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో నాయకులు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగలు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో చేసిన పోరాటం ఉద్యోగాల కోసం అని అలాంటిది వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే మాదిగలకు ఏం న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 నియామకాలు జరగాలంటే పదేళ్ల పాటు సమయం పడుతుందని అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్ 1 , 2 , 3 ఉద్యోగ నియమకాలు మళ్లీ నోటిఫికేషన్ రావాలంటే మరో పదేళ్లు పడుతుందని మళ్లీ పదేళ్లపాటు మాదిగ మాదిగ ఉప కులాల నిరుద్యోగులు. నష్టపోవాల్సి వస్తుందని ఇది ముమ్మాటికి మాదిగలకు ప్రభుత్వం తీవ్ర నష్టం చేస్తుందని దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి మంచి మనసుతో అర్థం చేసుకొని గ్రూప్ 1 , 2 , 3 నియామకాలలో వర్గీకరణ అమలు చేసి మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మొన్న ప్రభుత్వం వర్గీకరణ లేకుండా డీఎస్సీ నియామకాలు చేపట్టడం కారణం వల్ల మాదిగలకు 11 వందల ఉద్యోగాలు రావలసి ఉండగా వర్గీకరణ లేకుండా డీఎస్సీ నియామకాలు చెప్పడం వల్ల మాదిగలకు కేవలం 300 నుంచి 400 వరకు మాత్రమే ఉద్యోగాలు వచ్చి దాదాపు 700 ఉద్యోగాలు మాదిగలు నష్టపోయారని దయచేసి ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకొని మాదిగల పక్షాన నిలబడి న్యాయం చేయాలని కోరడం జరిగింది. గ్రూప్ 1 నియామకాల్లో వర్గీకరణ అమలు జరిగితే మాదిగలకు 50 నుండి 60 ఉద్యోగాలు వస్తాయని వర్గీకరణ లేకపోతే మళ్లీ ఈ ఉద్యోగాల్లో కూడా మాదిగలు నష్టపోతారని మల్ల మాదిగలు ఉన్నతస్థాయి ఉద్యోగలలో ఉండారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మాదిగలు అంతా ఏకతాటిపైకి వచ్చి నూతనఈ ఉద్యోగ నియామకాల్లోనే వర్గీకరణ అమలు చేసుకునే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధపడి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని మాదిగలకు పిలుపునిచ్చారు.
మెదక్ మండల అధ్యక్షులు చెవిటి గట్టయ్య ఉపాధ్యక్షులు యాదగిరి మెదక్ పట్టణ నాయకులు ప్రభాకర్ ప్రవీణ్ దేవేందర్ ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంపత్ కుమార్ నాగరాజు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !