నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 16: అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ నారం రాజ్ శేఖర్ వివాహ వేడుకలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో మరియు స్థానిక నాయకులతో కలిసి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సోయం వీరభద్రం, జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, మోటూరి మోహన్, గోవిందు, చిప్పనపల్లి శ్రీను, తుంపాటి రమేష్ తదితరులు ఉన్నారు.
Post Views: 152









