నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, మార్చి 16:- వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీల వెంకట నర్సిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా కొత్త ఆర్టీసీ సర్వీస్ రూట్ ను ఏర్పాటు చేసినారు. ఆ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆర్టీసీ సర్వీసును ప్రారంభించిన అనంతరం వైరా పాత సెంటర్ శ్రీ కోదండ రామాలయ దేవస్థానం నందు నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ ను రెబ్బెన కట్ చేసి ప్రారంభించినారు.అనంతరం పంచ కట్టు ఓణీల అలంకరణ వేడక్కు హాజరై చిన్నారులను ఆశీర్వదించినారు. తదనంతరం వైరా రింగ్ సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను నిప్పంటించి నిరసన తెలిపినారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉండి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ శాసనసభాపతి కుర్చీని అవమానపరిచిన జగదీశ్వర్ రెడ్డి ఆ పార్టీ నాయకత్వం దళితుడైన శాసనసభాపతిని అగౌరపరుస్తూ అసెంబ్లీలో కస్తాయించిన తీరుకు నిరసనగా వారిని అసెంబ్లీ నుంచి బహిష్కరించటం జరిగింది.వారిని పూర్తిగా బహిష్కరించాలని వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను.గత బిఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో దళితుడైన భట్టి విక్రమార్క మల్లు ఆనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే దళితుడు మాతో సమానంగా ఉండటం ఏంటని ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రతిపక్ష నాయకుడి హోదాను కోల్పోయే విధంగా వ్యవహరించిన తీరు, మా కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని అసెంబ్లీలో నుంచి బహిష్కరించి, మీ పార్టీలో ఉన్న తాటికొండ రాజయ్యకు ఉపముఖ్యమంత్రిని చేసి నిండు సభలలో అవమానపరిచి మంత్రి పదవిని పీకేసిన విధానం మీరు దళితులపై మీ పార్టీ మీ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనించే ఈనాడు మిమ్మల్ని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారు. ఆది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కోల్పోయిన మీరు ఈనాడు తట్టుకోలేక పిచ్చెక్కినట్టు వ్యవహరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ యావత్ ప్రజానీకం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి శాసనసభాపతికి క్షమాపణలు చెప్పి మీ తీరును మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాను.ఈ కార్యక్రమంలో వారితో పాటు బొర్రా రాజశేఖర్, వడ్డే నారాయణరావు, ఏదునూరి సీతారాములు, సుతకని జైపాల్, కట్ల రంగారావు, నర్వానేని అశోక్, షేక్ రఫీ, మచ్చ బుజ్జి, శ్రీరామనేని తిరుపతిరావు, బేడీకే రత్నం, పాలేటి నరసింహారావు, బోళ్ళ గంగారావు, పణితి శ్రీను, పమ్మి అశోక్, గుగులోతూ రాము, శీలం నాగిరెడ్డి, తెళ్ళురి వీరయ్య, మచ్చ రామారావు, శీలం చంద్రశేఖర్ రెడ్డి, మల్లు రామకృష్ణ, ధర్నా రాజశేఖర్, చింతనిప్పు మాధవరావు, అది ఆనందరావు, తాళ్ళ వసంతరావు, పినపాక రాజు, వీరంశెట్టి సీతారాములు, ఏదునూరి శ్రీను, బండి వెంకటేశ్వర్లు, అయిలూరి కృష్ణారెడ్డి, కారుమంచి లచ్చులు,కారుమంచి జమాలయ్య, కారుమంచి రమేష్, కారుమంచి యాకోబు, యతమల రవీందర్ రెడ్డి, శీలం శ్రీనివాస్ రెడ్డి, కట్ల సంతోష్, మధిర ఆర్టీసీ డిపో మేనేజర్, వన్నవరపు ఏడుకొండలు, మహిళా కాంగ్రెస్ నాయకులు మాజీ గన్నవరం సర్పంచ్ శీలం సీతారావమ్మ, మాజీ గన్నవరం ఎంపీటీసీ యరమల సౌజన్య తదితరులు పాల్గొన్నారు.









