+91 95819 05907

చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి… ఆపై తండ్రి ?

*కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి, సైకో తండ్రి*

కన్నబిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి.. ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు.అత్యంత క్రూరంగా వారి జీవితాలను చిదిమి వేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి నీళ్ల బకెట్లలో తలలు ముంచి ఊపిరి తీశాడు. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

చదువుల్లో వెనకబడ్డారని ఇద్దరు పిల్లలను చంపేసి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పిల్లల కాళ్లు చేతులు తాళ్లతో కట్టి నీళ్ళల్లో ముంచి తండ్రి చంద్ర కిషోర్ చంపిన తీరు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

ఇద్దరు పిల్లలను చంపి తర్వాత తాను ఉరివేసు కుని ఆత్మహత్య చేసు కున్నాడు.పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకిషోర్ సూసైడ్ నోట్ లో రాశాడు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకి నాడ జిల్లా వాకల పూడి లోని ONGC ఆఫీస్‌లో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు.

అయితే పిల్లలు చదువులో వెనుకబడి ఉండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.హోలీ పండుగ సందర్భంగా భార్య తనూజను ఇద్దరు కుమారులు జోషిల్ నిఖిల్‌ను తీసుకుని చంద్రకిశోర్ తన ఆఫీస్‌కి వెళ్లాడు.అనంతరం పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని చెప్పి భార్యను ఆఫీస్‌ లోనే ఉండమని నమ్మించి.ఇద్దరు పిల్లలను తీసుకోని చంద్రకిశోర్ ఇంటికి వెళ్లాడు.

ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చంద్రకిషోర్ పిల్లల కాళ్లు చేతులు కట్టేసి నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు ముంచి హత్య చేశాడు. ఆపై తాను ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతసేపటికీ భర్త రాకపో వడంతో తోటి ఉద్యోగులతో కలిసి తనూజ ఇంటికి వెళ్లింది.

కిటికీ నుంచి చూడగా భర్త, పిల్లలు విగతజీవులుగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.. ఇద్దరు పిల్లలను హత్య చేసి చంద్రకిషోర్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

*పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్*

*NOTE*

*పోటీ ప్రపంచంలో పోటీ పడ్డప్పుడే ప్రతిభ బయటకి వస్తుంది.పిల్లల్లో ఉన్న టాలెంట్ ని గుర్తించరు.మార్కులు ర్యాంకులు ప్రైజులు మెడల్స్ అంతేనా జీవితం…?*
*వాళ్ళు గీసే గీతల్లో కూడా అద్భుతమైన కళాఖండాలు ఉంటాయి.*
*ఆడే పాడే వయస్సులో అల్లరిఉంటుంది సరైన మార్గంలో పెట్టి పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది సైకోలా పిల్లలు ప్రాణాలు తీసి పిరికి వాడిగా ప్రాణాలు తీసుకోవడం దురదృష్టకరం……🥲*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !