రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 16:- బీటెక్ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన వెలుముల నందిని (23) అనే విద్యార్థిని హైదరాబాదులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది.అక్కన్నపేటలో ఆదివారం రోజు మధ్యాహ్నం అందజా 3:30 గంటలకు పిర్యాదు దారుడు అగు వెలుముల నర్సింలు తండ్రి సత్తయ్య అతని కుటుంబీకులతో కలిసి తోనిగండ్ల గ్రామంలో ఫంక్షన్ లో ఉండగా అట్టి సమయంలో అతని రెండవ కూతురు వేలుముల నందిని తండ్రి నర్సింలు కూతురు ఆమె తన ఇంటి తలుపులు వేసుకొని ఉరి వేసుకుంటున్నాను.అని తన గ్రామానికి చెందిన పోలీసు దినేష్ తండ్రి సిద్ది రాములుకు తెలుపగా ఆతను ఫిర్యాదుదారుడు నర్సింలు కు తెలుపగా వెంటనే వారు వచ్చి మరియు వీరు తలుపులు పగులగొట్టి లోపలికి వేల్లి చూడగా రెండవ రూమ్ లో లుంగితో ఉరివేసుకొని చనిపోయినట్లు తెలిపారు.మృతదేహాన్ని వెంటనే రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు.









