◆ తెలంగాణలో రాజకీయాలు కాస్త వ్యక్తిగతం వైపు
◆ అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్ చిట్టా విప్పుతానాని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
◆ అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి పై కౌంటర్ ఇచ్చిన బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నేటి గదర్ న్యూస్,హైదరాబాద్:
✍️KDR,9581905907
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు నానాటికి హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి అన్ని ప్రధాన పక్ష పార్టీల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … మాజీ సీఎం కెసిఆర్ చిట్టా అసెంబ్లీలో విప్పుతానని ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో బీ ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదిక గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పై ఘాటుగా స్పందించారు.
రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలవదా?
ఇప్పటకీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ.. ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు.
సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు
బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి
పదేళ్ళు అధికారంలోకి ఉన్న మాకు ఎవరు ఎంటో అన్నీ తెలుసు
అని కేటీఆర్ పోస్ట్ చేశారు. దీనితో అసెంబ్లీలో ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ కి సన్నద్ధం అయ్యాయి. ఏది ఏమైనాప్పటికీ ఏం నిజాలు బయటికి రానున్నాయి అని తెలంగాణ ప్రజలకు ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీనితో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత హిటెక్కనున్నాయి.









