+91 95819 05907

మిరపకాయలు కాలబెట్టిన నిందితుల రిమాండ్ :CI

– వివరాలు తెలిపిన సిఐ వెంకటేశ్వరరావు

నేటి గదర్ న్యూస్,పినపాక:
పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి మిరపకాయలు కళ్ళoలో ఎండబెట్టిన 50 క్వింటాళ్ల మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రైతు పురుషోత్తం బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై రాజకుమార్ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి సాక్షాధారాల ఆధారంగా నిందితులను గుర్తించారు. స్థానిక సీఐ తెలిపిన వివరాల ప్రకారం వెంకటరవుపేట గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ వెంకటేశ్వర్లు, మంచర్ల వెంకటేశ్వర్లు లను నిందితులుగా గుర్తించామని తెలిపారు.వెంకటేశ్వరపురం గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటే ఆ ఇద్దరు వ్యక్తుల్ని వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్ పై పారిపోతుంటే పట్టుకొని విచారించగా తాండ్ర బాలకృష్ణ అనే వ్యక్తి భార్య గత సంవత్సరం క్రింద చనిపోగా దానికి కారణం పురుషోత్తంమే మంత్రాలు చేయడం వల్లనే తన భార్య చనిపోయిందని అతడు మనసులో కక్ష పెంచుకొని ఈ విషయాన్ని తన మామ వెంకటేశ్వర్లుకు చెప్పగా అతడు కూడా తనను పెద్దమనిషిగా ఎదగనీయకుండా పురుషోత్తమే అన్ని పంచాయతీలలో అడ్డుపడుతున్నాడని అతనిని ఎలాగైనా ఆర్థికంగా దెబ్బ తీయాలని ఇద్దరు మనసులో అనుకొని సరైన సమయం కోసం వేచి చూస్తూ 10వ తారీకు అర్ధరాత్రి సమయం లో మిరపకాయలకల్లాల వద్ద ఎవరు కాపలా లేరని గమనించి పురుషోత్తంనికి సంబంధించిన 50 క్వింటాళ్ల మిర్చి కుప్పగా వేసి ఉండగా బాలకృష్ణ తను తెచ్చిన ఐదు లీటర్ల పెట్రోలు ఎండు మిర్చి చుట్టూ చెల్లి నిప్పంటించినాడన్నారు.వెంకటేశ్వర్లు రోడ్డుపై ఎవరూ రాకుండా కాపలాగా ఉన్నాడనీ,
మిర్చి అంటుకున్న వెంటనే ఇద్దరు అక్కడి నుండి పారిపోయి ఇళ్లకు పోయి రాత్రి ఇళ్లలోనే నిద్రించారని వివరాలు తెలిపారు. సోమవారం నిందితులను ఇద్దరినీ పట్టుకొని రిమాండ్ కు పంపించడం జరిగిందన్నారు.కేసును త్వరగా చేదించిన ఏడుల్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు ,
ఎస్సై రాజుకుమార్ లను డి.ఎస్.పి రవీందర్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో
సిబ్బంది లక్ష్మీనారాయణ,
దిలీప్, శ్రీనివాస్ ,రాము, లక్ష్మయ్యలు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !