యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు వినతి పత్రాన్ని అందించిన టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెళ్లి.
ఏరియా నందు డి గ్రేడ్ అర్హత సాధించిన టెక్నిషియన్స్ కు డి గ్రేడ్ పదోన్నతుల పత్రాలు అందించాలని కోరుతూ ఏరియా యస్ ఓ టూ జి యం శ్యామ్ సుందర్ కు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ,నాయకులు సోమవారం నాడు స్థానిక జి యం కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు… కొత్తగా సవరించిన యం సి క్వార్టర్ నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా సిద్ధం చేసి అర్హులైన డి గ్రేడ్ కేటగిరి వారికి యం సి క్వార్టర్ లు ఎంపిక చేసేందుకు ఆయా గనుల, డిపార్ట్ మెంట్ ల ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి గడువు ఈ నెల 20 వ తేదీగా ప్రకటించడం జరిగింది.. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం యం సి క్వార్టర్ లకు అర్హత ఉన్న టెక్నీషియన్స్ కు నేటి వరకు డి గ్రేడ్ పదోన్నతి పత్రాలు అందలేదు.. దానితో పాటు ఇటివల అర్హత పరీక్ష లో ఉత్తీర్ణత సాధించి డి గ్రేడ్ కు అర్హత పొందిన 144 బ్యాచ్ కు చెందిన ఈ పి ఆపరేటర్ ల నుంచి కూడా యం సి సీనియారిటీ జాబితా కు దరఖాస్తు లు తీసుకోవాలని కోరారు..అర్హత ఉండి కూడా డి గ్రేడ్ పదోన్నతి పత్రాలు సకాలంలో అందకపోవడం వల్ల వారంత దరఖాస్తు చేసుకోలేక పోతున్నారని తెలిపారు..క్వార్టర్ ఎంపిక కోసం అధిపతులు సూచించిన గడువు కంటే ముందే డి గ్రేడ్ పదోన్నతుల పత్రాలు అందించే విధంగా చొరవ చూపాలని లేని యెడల గడువు తేదీనీ పెంచే అంశంలో కానీ, అర్హులైన వారిని గుర్తించి పదోన్నతి పత్రం తో సంబంధం లేకుండా దరఖాస్తులు స్వీకరించే అంశం లో స్థానిక సంబంధిత అధిపతులు ప్రత్యేక చొరవ చూపాలని వినతి పత్రం రూపంలో పొందుపరచి అందించారు. టి బి జి కె యస్ ఆయా కార్మిక సంఘాల విజ్ఞప్తి మేర యం.సి క్వార్టర్ ఎంపిక లో నిబంధనలు సవరించిన స్థానిక అధిపతులకు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు,కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మస్తాన్, నరేష్ , రఫిక్ తదితరులు పాల్గొన్నారు









