+91 95819 05907

అకారణంగా విద్యార్థి సంఘ నాయకులను నిర్బంధించడం హేయమైన చర్య:PDSU

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి కారణాలు లేకుండానే పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, పి డి యస్ యూ జిల్లా నేతలు బానోత్ నరేందర్,మునిగల శివప్రశాంత్,ఎ.పార్థసాథి లతో పాటు ఇతర విద్యార్థి సంఘ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం హెయమైన చర్య అని పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు బి.సాయి,పట్టణ నాయకులు అబ్దుల్ గని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగానే నేడు ప్రజాపాలనంటూ ఊదరగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడతానంటూ ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన నిజస్వరూపం బట్టబయలు అవుతుందని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకుల ఇండ్లకు అర్ధరాత్రి సమయంలో వెళ్లి భయభ్రాంతులకు గురిజేస్తూ అనేకమందిని తెల్లవారుజామునే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ప్రజాపాలన ఎట్లా? అవుతుందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు,ప్రదర్శనలు, నినాదాలు చేయరాదని అప్రజాస్వామికమైన సర్కులర్ తో ఆంక్షలు విధించడం, మరోపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఆక్రమించుకొని కార్పొరేట్ సంస్థలకు దార దత్తాం చేసేందుకు యూనివర్సిటీ విద్యార్థులపై నిర్బంధాన్ని ప్రయోగించి మాట్లాడకుండా గొంతులు నొక్కేస్తున్న క్రమంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల మద్దతు లభిస్తుందనే భయంతోనే ఈ విధమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ పోకడలను మానుకొని ఓయూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో నిర్బంధ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు

హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు.. వాళ్ళను వెనక్కి పంపాలని రేవంత్ ప్రభుత్వానికి అమిత్ షా ఆదేశాలు పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి

Read More »

రైతుల భూములను భరోసా కల్పించే చట్టం భూ భారతి చట్టం… జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ

నేటి గద్దర్ న్యూస్,చింతకాని ప్రతినిధి, రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. *గురువారం జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ చింతకాని మండలం నాగులవంచ

Read More »

నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై..ఆశీర్వదించిన జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు& ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు.మడుపల్లి భాస్కర్.

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిధి, ఈరోజు ఖమ్మం పట్టణంలోని R R R. ఫంక్షన్ హాల్ నందు …చింతకాని చెన్నకేశవ స్వామి దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ *దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మేనకోడలు వేమూరి

Read More »

కాశ్మీర్ లో జరిగిన దాడికి నిరసనగా శాంతి ర్యాలీ, నిరసన

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో మల్కరం వెళ్లే జంక్షన్ (రవి మెడికల్స్) ఎదురుగా మేము సైతం ఫౌండేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో కాశ్మీర్లో జరిగిన

Read More »

చలో వరంగల్, సైకిల్ పై ప్రచార యాత్ర నిర్వహించిన బిఆర్ఎస్ కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 24: ఈనెల 27 న వరంగల్ లో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ, ను జయప్రదం చేయాలని కోరుతూ సైకిల్ యాత్ర ప్రారంభించిన భద్రాద్రి

Read More »

ఈనెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుంది

. గజ్వేల్ మండల్ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి చిట్యాల ఎల్లం. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) ఏప్రిల్ 24. వరంగల్ లో ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే రజోత్సవ

Read More »

 Don't Miss this News !