+91 95819 05907

జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

★రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2వ తేదీ నుంచి భూభార‌తి చ‌ట్టంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హణ

💠గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో రాష్ట్రంలో పేరుకుపోయిన భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల‌న్న ఆశ‌యంతో గ‌త నెల 14వ తేదీన భూభార‌తి చ‌ట్టాన్ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి
రేవంత్ రెడ్డిగారి చేతుల‌మీదుగా ప్రారంభించుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌యోగాత్మ‌కంగా అదేనెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో మరియు ఈనెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులను నిర్వ‌హిస్తున్నాం.

💠ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకొని వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాం. ఈ రెవెన్యూ స‌ద‌స్సుల‌లో వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌కు నిర్ధేశిత గ‌డువు పెట్టుకొని భూ భార‌తి చ‌ట్టం ప‌రిధిలోకి వ‌చ్చే ప్ర‌తి ద‌ర‌ఖాస్తుకు ప‌రిష్కారం చూపిస్తాం.

💠ప్ర‌యోగాత్మ‌కంగా నిర్వ‌హించిన మండ‌లాల్లో ఇప్ప‌టికే కొన్నింటిని ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది. ఈనెల చివ‌రినాటికి వీలైనంత‌వ‌ర‌కూ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఇప్ప‌టికే క‌లెక్ట‌ర్ల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింది. ప‌రిష్క‌రించ‌లేనివాటికి ఎందుకు ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నామ‌నే విష‌యాన్ని లిఖిత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తుదారుల‌కు తెలియ‌జేస్తాం, ఎప్పటికీ పరిష్కారం కానివి ఉంటే అసలు పరిష్కార యోగ్యం లేనివి అక్రమమైనవి ఉంటే అవి పరిష్కారం కావు అని చెప్ప‌డం జ‌రుగుతుంది. సాదాబైనామాల‌కు సంబంధించిన అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉంది. కోర్టులో స్టే వెకేట్ అయిన వెంట‌నే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిస్తాం. భూ సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలి అనేది భూ భారతి చట్టం లక్ష్యం.

💠ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌డానికి గ‌త ఏడాదిన్నర కాలంగా రెవెన్యూ విభాగంలో చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు, తీసుకున్న నిర్ణ‌యాల‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తుంది. భార‌తి చ‌ట్టాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతున్నాయ‌న్న సంతోషం వారిలో క‌నపడుతుంది. అలాగే స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది.

గత ప్ర‌భుత్వం చేసిన నిర్వాకం వ‌ల‌న మొత్తం రెవెన్యూ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌య్యాయి, మొత్తం వ్య‌వ‌స్ధ‌ను ప్ర‌జ‌ల‌కు చేరువు చేసి వారికి మెరుగైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా మన ప్రజా ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జనంలోకి ‘మెచ్చా’.. బాధితులకు కొండంత భరోసా!

​అశ్వారావుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన: ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం.. కార్యకర్తలకు దిశానిర్దేశం! ​నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 07: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,

Read More »

మణుగూరులో ఒకేరోజు ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తుల మరణం – పట్టణంలో తీవ్ర విషాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలానికి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యాపారస్తులు ఈరోజు అనారోగ్య కారణాలతో మరణించడం పట్టణ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పట్టణ అభివృద్ధికి, వ్యాపార రంగానికి తమదైన సేవలు

Read More »

వెలుగుల బాటలో కేశప్పగూడెం: సర్పంచ్ పట్టుదలకు దక్కిన ఫలితం!

​లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం.. 25 కేవిఏ కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 06: అశ్వరావుపేట మండలంలోని కేశప్పగూడెం గ్రామ పంచాయతీలో ఏళ్ల తరబడి

Read More »

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

 Don't Miss this News !