*అడవిరామారం గ్రామంలో చరవాణి టవర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎస్పీ రోహిత్ రాజ్ కు గ్రామస్తుల కృతజ్ఞతలు*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, మన్యం గ్రామంలో నీ ప్రజలు ఇకనుండి హలో హలో అననున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిరామారం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చరవాణి టవర్ ను బిఎస్ఎన్ఎల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. సోమవారం గుండాల సీఐ రవీందర్ ఆధ్వర్యంలో అడవిరామారం గ్రామాన్ని సందర్శించి అనంతరం ఆయన మాట్లాడుతూ టవర్ పూర్తి అయిందని త్వరలోనే సిగ్నల్ వచ్చే విధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ప్రారంభానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై సంబంధిత బిఎస్ఎన్ఎల్ అధికారులతో ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు. అదే గ్రామంలో ఎస్పీ రోహిత్ రాజ్ పర్యటించినప్పుడు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేసిన ఎస్పి రోహిత్ రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు









