రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 19:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం నాడు తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ఈవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివాహాలు అయినటువంటి వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించాలని మండల వ్యాప్తంగా ప్రజల నుండి నాలుగు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేయవచ్చని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియపరచారు.
Post Views: 134









