రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 19:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రామాయంపేట తండాలో శ్రీ జగదంబ సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం చౌడి రవితేజశర్మ అర్చకుల బృందము ఆధ్వర్యంలో సోమవారం నాడు తండాలో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ సోమవారం నుండి బుధవారం వరకు జగదంబ సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవం దుర్గభవాని మాత యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమం
నిర్వహించడం జరుగుతుందని ఆన్నారు.సోమవారం ఉదయం.
శ్రీ,గణపతి,గౌరీపూజ స్వస్తి పుణ్యహవచనం, మంటపారాధన, సాయంత్రం జలాధివాసము, ధాన్యాధివాసము మంగళవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు హోమ కార్యక్రమాలు సాయంత్రం శయ్యాధివానము,పుష్పధివాసము బుధవారం ఉదయం 3 గంటలకు యంత్ర ప్రతిష్ఠ,అభిషేకము, మంగళహారతి, ఆశీర్వచనం తీర్థప్రసాద వితరణ.కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల బంజారా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు గూగులోత్ రవి మంజుల, ఆలయ కమిటీ అధ్యక్షుడు గూగులోత్ రాములు నాయక్ ఉపాధ్యక్షుడు,బానోత్ శంకర్ నాయక్.నెహ్రు నాయక్,గన్యా నాయక్,రామావత్ దౌల్య నాయక్,గురునాయక్,రవి నాయక్,సురేష్ నాయక్, సుధాకర్ రాథోడ్, సూర్య, తులసిరామ్,బానోత్ కిషన్,బానోత్ సురేష్, గుగులోత్ రాజు, బన్సీలాల్, జెమిలి,సంధ్య, బధ్య,గుడి పూజారి గణేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.









