లా..కొడులను చావ..దే….గండి
౼గిరిబిడ్డలకు కట్టలు తెంపిన ఆగ్రహం
౼గుడిసెలు తొలగించడానికి వచ్చిన యంత్రాలపై సమ్మక్క సారలమ్మలై తిరగబడ్డారు.
నేటి గదర్ న్యూస్,మంగపేట(ములుగు):గిరి బిడ్డలకు ఆగ్రహం కట్టలు తెంపుకుంది.ఆడ,మగ అనే తేడా లేకుండా కర్రలు చేత బట్టుకోని అధికారులను ఉరికించారు.. తమ గుడిసెలు తొలగించడానికి వచ్చిన యంత్రాలపై సమ్మక్క సారలమ్మలై తిరగబడ్డారు.వివరాలు..
ములుగు జిల్లాలో గుడిసెలు తొలగించడానికి వచ్చిన అధికారులకు గిరి బిడ్డలు ఎదురు తిరిగారు
ఏటూరునాగారం మండలం రోహీర్ బీట్ పరిధిలోని చల్పాక రహదారి వెంట అటవీ భూములలో గిరిజనులు గుడిసెలను వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పోలీసుల సహకారంతో జేసీబీ, డోజర్ వాహనాలతో గుడిసెలు తొలగించే ప్రయత్నం చేశారు. దీనితో వారు కోపద్రిక్తులై తిరగబడ్డారు. రాయడానికి వీలు లేని భాషతో కర్రలు చేతబట్టి గుడిసెలను తొలగించడానికి వచ్చిన యంత్రాలని అడ్డుకున్నారు. మా రాజ్యంలో మీరెవరని ప్రశ్నించారు.
కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు. ప్రాణాలు అర్పిస్తాం కానీ గుడిసెలను వదిలి వెళ్లే ప్రసక్తి లేదని అధికారులకు తేల్చి చెప్పారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితి నెలకొన్నది. మానవత దృక్పథంతో గుడిసెలను తొలగించొద్దని ఆదివాసి బిడ్డలు కోరుతున్నారు.









