*ఆదివాసీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ గోంది ముయన్న*
నేటి గదర్ వెబ్ డెస్క్: చర్ల మండల కేంద్రం బస్టాండ్ సెంటర్ గొండ్వాన సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో GSP సీనియర్ నాయకులు బీరబోయిన. శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ సీనియర్ నాయకులు మాజీ. ఎంపీపీ గొంది.ముయన్న మాట్లాడుతూ గిరిజన అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షుడు ఆయిన దుబ్బరాజు ఆదివాసి ఉద్యమ చరిత్రలో ఉన్నాడా. నీ స్థాయి నీ స్థానం ఏమిటని?అన్నారు.దుబ్బరాజు అనే వ్యక్తి ఊసరవెల్లి లాగా వివిధ పార్టీలు మారుకుంటూ నీ యొక్క ఆర్థిక స్వలాభం కోసం గిరిజన అభ్యుదయ సేవా సంఘం పెట్టుకొని సంఘం ముసుగులో అనేక దౌర్జన్యాలకు దిగుతూ రెండు దశాబ్దాల కాలం నుంచి ఉద్యమ చరిత్ర కలిగి ఉన్న గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర 9 ఆదివాసీ సంఘాల సమన్యాయకర్త జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అయినటువంటి పాయం. సత్యనారాయణ పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఉరుకునేది లేదని అన్నారు.సొందే వీరయ్య నాయకత్వం లో జీవో నెంబర్.3 పై న్యాయ పోరాటం చేశారు. ST బోగస్ సర్టిఫికెట్ ఒక మాజీ ప్రజా ప్రతినిధి పై పోరాటం చేసి కలెక్టర్, కోర్ట్ అతని ST బోగస్ సర్టిఫికెట్ రద్దు చేపించిన ఘనత పాయం సత్యనారాయణది అని గుర్తుచేశారు. కుదునూరు, దేవరపల్లి పోడు భూముల పోరాటం సీ కత్తిగూడెం గ్రామపంచాయతీ ఆదివాసులకు కోరేగడ్డ భూమి న్యాయ పోరాటం, నిరంతరం1/59, 1/70,పెస, అటవీ హక్కుల గుర్తింపు పార్లమెంట్ చట్టాల అమలు కొరకు నిరంతరం ఉద్యమం చేస్తున్న, ఆదివాసీ ఉద్యమ నేత పాయం అని అన్నారు. దుబ్బ రాజు నికిలగా ప్రభుత్వ భూములు ఇప్పిస్తానని, ఇంటి స్థలాలు ఇప్పిస్తానని,అమాయక ఆదివాసి యువకులను వెనక పెట్టుకొని ఐదువేల రూపాయలు వసూలు చేసింది. నీవు కాదా అసలు ఆదివాసి చట్టాల పై నీకు అవగాహన ఉందా అవగాహన ఉంటే నువ్వు ఆదివాసుల కోసం చేసిన కృషి ఏమిటో తెలపాలి నువ్వు నిజమైన స్థానిక ఆదివాసీ వి అయితే నిన్ను గత చర్ల తాహసిల్దార్ గా పని చేసిన ఈరెల్లి నాగేశ్వరావు వలసవాది అనడం గుర్తులేదా.ఇసుక ర్యాంపుల్లో ఆదివాసులు మధ్య చిచ్చుపెట్టేది నీవు కాదా ఇదంతా మర్చిపోయి నీ రాజకీయ అవకాశవం కోసం నువ్వు టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, బీజేపీ, పార్టీ లల్లో పదవుల కోసం తిరిగింది నిజం కదా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అంత తెలుసు అనిఅన్నారు.ఎంతపాటి ఘనుడవో, నీకు చేతనైతే గిరిజన హక్కుల కొరకు పోరాటం చెయ్యి, అంతేగాని సీనియర్ ఉద్యమ నాయకులు 20 సంవత్సరాలు ఆదివాసి ఉద్యమ చరిత్ర కలిగిన పాయం.సత్యనారాయణ పై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆదివాసీ జాతి తిరుగుబాటు చేస్తాది అంటూ హెచ్చరించారు. చీమలపాడు శ్రీ సిర్రాజు మహిళా సొసైటీ ఇసుక ర్యాంపులో హైకోర్టు కేసుదాక వెళ్లి రాజకీయాలు చేసేది.నువ్వు కాదా ఇది నీ కుట్ర బుద్ధి ఇదంతా మర్చిపోయి,చర్ల పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక షాపులో గిరిజనేతరుడికి కొమ్ముకాస్తూ భినామీ గా నిలబడింది నీవు కాద,నీ ఆరోపణలు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమం లో గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోంది. లీలా ప్రసాద్, ఆదివాసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వినర్ ఇర్ప. ప్రకాష్ దొర.గొండ్వాన సంక్షేమ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం. వరప్రసాద్.సీనియర్ ఆదివాసీ ఉద్యమ నాయకులు ఇర్ప. అంజిబాబు. ఇర్ప. రామకృష్ణ. ఇర్ప. అరుణ్ కుమార్.మహిళ సంఘం నాయకురాలు. గుండి. ఇందిరా. తదితరులు పాల్గొన్నారు.









