నేటి గదర్ న్యూస్, వైరా:
సీట్ల కోసం, ఓట్ల కోసం దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ అమలు కానీ హామీలను ఇచ్చింది. గోదావరి పరీవాహక ప్రాంతంలోని సాగునీరు లేదు. రైతులు పోసుకున్న నార్లు ముదిరిపోతున్నాయి. రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి, ఇప్పుడు కొలతలు, నిబంధనల ప్రకారం అంటూ లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారు. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు.రాజీవ్ యువ వికాసం పేరిట ఆర్బాటం చేసిన ప్రభుత్వం లక్షలాది ధరఖాస్తులను స్వీకరించి ఇంత వరకు ఒక్కరికీ లబ్ధి చేకూర్చలేదు. రేవంత్ రెడ్డికి బీసీలంటే చిన్నచూపు ఉన్నది. ఆయనకు బీసీలపై ఉన్నది కపటప్రేమే. రాబోయే స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే బీసీ రిజర్వేషన్లు, ఇతర పథకాలంటూ ఆ పార్టీ డ్రామాలు ఆడుతున్నది. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందో చెప్పాలి గిరిబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









