+91 95819 05907

అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి : సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి.

వాగులపై హై లేవల్ వంతెనలు నిర్మించాలి

కాలువల సైడ్ వాల్స్ నిర్మాణంలో లోపాలపై విచారణ జరపాలి.

స్థానిక సమస్యల పరిష్కారానికి సిపిఐ(ఎం) కృషి

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా నియోజకవర్గంలో అకాల వర్షాల ప్రభావంతో వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పెసర, పత్తి, వరి రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తీవ్రమయ్యాయని, మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చేంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, సీజనల్ వ్యాదులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, వైద్య శిబిరాలు గ్రామ గ్రామాన నిర్వహించాలని కోరారు. పల్లిపాడు – ఏన్కూర్ రహదారిలోని లాలాపురం – తీగల బంజర – అంజనాపురం – జన్నారం గ్రామాల మధ్య వాగులపై హై లెవెల్ వంతెనలు లేకపోవడంతో రాకపోకలు స్తంభించి పోతున్నాయని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, వైరా రిజర్వాయర్ కాలువల సైడ్ వాల్స్ నిర్మణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని, వరదలతో విప్పలమడక – లింగన్నపాలెం మధ్య సైడ్ వాల్ కూలిపోయిందని ఆరోపించారు. కోట్ల రూపాయలతో మంజూరైన కాల్వల ఆధునీకరణ
పనుల్లో జరిగిన లోపాలపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డుల్లో వర్షపు నీరు నిల్వ ఉండి, సైడ్ డ్రైనేజీలు పనిచేయకపోవడం, వీధి లైట్లు పనిచేయకపోవడం వంటి సమస్యలను సిపిఐ(ఎం) సర్వేలో గుర్తించినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమగ్ర కృషి చేయాలని, ఇప్పటికే సిపిఐ(ఎం) ప్రజా సమస్యలపై కృషి చేస్తుందని, ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న రోడ్లను ఆర్&బి అధికారులు వెంటనే మరమ్మతు చేయాలని ఆయన కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !