నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 21: దమ్మపేట మండలం, పెద్దగొల్లగూడెం గ్రామం క్రీడా మైదానంలో దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారె పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే సహనాన్ని పెంపొందిస్తాయన్నారు. ఫోటోగ్రాఫర్లతో పాటు ప్రతి ఒక్కరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు చాలా అవసరం అన్నారు. అలాగే ఫోటోగ్రాఫర్లు ఒక వృత్తి పరంగానే కాక సమాజానికి అందించే సేవలు ఎంతో విలువైనవని వారి ఐక్యతతో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు, స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.









