*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, మండలంలోని గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజా పంథా) ఆధ్వర్యంలో ఎంపీడీవో కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం మండల కార్యదర్శి కొమరం శాంతయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించలేదని అందుచేత ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, డివిజన్, జిల్లా నాయకులు వాంకుడోత్ అజయ్, లక్ష్మయ్య, జగన్, సింగన్న, బాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 60









