*వంతెన పై తాత్కాలిక మరమ్మతులు చేయించిన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి*
*కార్యదర్శి అభినందించిన ప్రజలు*
*నేటి గదర్ న్యూస్ గుండాల*, శభాష్ శ్యామ్ సుందర్ జి అంటూ గుండాల కార్యదర్శిని ప్రజలు అభినందిస్తున్నారు. మండల కేంద్రం నుండి కొడవటంచ వెళ్లే మార్గమధ్యలో గల కిన్నెరసానివాగుపై ఉన్న లో లెవెల్ వంతెన పై గుంతలు పడడంతో ఆ గుంతలను కాంక్రీట్ వేసి గుంతలను పూర్తి చదునుగా చేశారు. గతంలో వాహనదారులు ఈ వంతెన పై వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. గుంతలను పూడ్చడం తో సాఫీగా ప్రయాణించవచ్చని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వంతెన పై తాత్కాలిక మరమ్మతులు చేసిన గుండాల పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డిని పలువురు అభినందించారు.
Post Views: 152









