నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
గ్రామాలలో ఉన్న పలు సమస్యలు గురించి తక్షణమే పరిష్కరించాలంటూ పాతర్లపాడు గ్రామ పంచాయతీ ఎదురుగా సిపిఐ, సిపిఎం, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం లో సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ. గ్రామాలలో హామీలు కోటలు అమలు శూన్యంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ప్రజలకు ప్రతిఫలాలు అందించిన దాఖలాలు లేవని. డ్రైనేజీలు, డంపింగ్ యార్డ్ స్మశాన వాటికలు, మరుగుదొడ్లు, బ్లీచింగ్ లేదు ఫాగింగ్ లేదు, ఇందిరమ్మ ఇల్లులు మండలంలో 10% కూడా రాలేదని, గ్రామాలలో పట్టణాల్లో అస్తవ్యస్తంగా ఉన్నదని. ఎన్నో పథకాలు హామీలు ప్రజలకు ఎలక్షన్లో మాటలతో మభ్యపెట్టి. నత్త నడకలు నడుస్తూ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా నడుస్తుందని మడిపల్లి గోపాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తదనంతరం గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ వర్షపు నీరు నిల్వ ఉన్న ఇళ్లల్లో,వీధులలో వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల నాయకులు సామినేని అప్పారావు. సిపిఐ నాయకులు తాళ్లూరి యాదగిరి.మరియు మండేపూడి కృష్ణారావు.కాటపత్తిన వీరబాబు.దారెల్లి రమేష్.కొత్తపల్లి వెంకటేశ్వర్లు.నెల్లూరు వెంకటేశ్వర్లు.మొన్న రామకోటయ్య.పంగా గోపయ్య.అచ్చయ్య. రామారావు తదితరులు పాల్గొన్నారు.









