+91 95819 05907

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ :
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

జిల్లాలోని 5 మునిసిపాలిటీలలో మొత్తం పోలింగ్ 82.50 శాతం నమోది

నేటి గదర్ న్యూస్, ఖమ్మం:
మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి  తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో 5 మున్సిపాలిటీలలోని 116 వార్డులకు జరిగిన పోలింగ్ లో మొత్తం 82.50 శాతం ఓటింగ్ నమోదైందని అన్నారు.  ఉదయం 9 గంటల వరకు 15.37 శాతం, 11 గంటల వరకు 37.10 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు 59.41 శాతం పోలింగ్ నమోదైందని, సాయంత్రం 3 గంటల వరకు 72.93 శాతం పోలింగ్ నమోదైందని, 5 గంటల వరకు 82.30 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని, మొత్తంగా ఖమ్మం జిల్లాలో 1,41,875 మంది ఓటర్లకు గాను 117043 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోగా, ఇందులో 55,506 మంది పురుష ఓటర్లు, 61,520 మంది మహిళా ఓటర్లు, 17 మంది ఇతరులు ఉన్నారు. మొత్తంగా జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 82.50 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు.పోలింగ్ జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీలో 85.45 శాతం, వైరా మున్సిపాలిటీలో 83.71 శాతం,
సత్తుపల్లి మున్సిపాలిటీలో 77.81 శాతం,
కల్లూరు మున్సిపాలిటీలో 87.08 శాతం,
మధిర మున్సిపాలిటీలో 78.19 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ తెలిపారు.
పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కలెక్టరెట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని అన్నారు.  అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పురపాలక ఎన్నికల్లో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంను తనిఖీ చేసి ఓటింగ్ సరళిని పరిశీలించి, పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు పవన్ కుమార్ కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ను పరిశీలించారు.
వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ లో డిఆర్ఓ పద్మశ్రీ, సిపిఓ శ్రీనివాస్, టెక్నీకల్ మేనేజర్ హనుమా చారి, ఈడిఎం దుర్గాప్రసాద్, టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

పోలీస్ స్టేషన్లో బైఠాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యే ★సీఐ క్షమాపణ చెప్పే వరకు కదిలేదిదని నిరసన

పాల్వంచలో దొంగ ఓటు పాల్వంచలో హైటెన్షన్.. పోలీస్ స్టేషన్ ముట్టడి మున్సిపల్ ఎన్నికల వేళ పాల్వంచ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ మహిళను దొంగ ఓటు ఆరోపణతో గంటల తరబడి

Read More »

బ్యాలెట్ బాక్సులు వెళ్లాల్సింది కౌంటింగ్ సెంటర్ కు పోలీస్టేషన్ కు కాదు ◆మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫేయిల్ : రేగా

నేటి గదర్ వెబ్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం: బ్యాలెట్ బాక్సులు వెళ్లాల్సింది కౌంటింగ్ సెంటర్ కు పోలీస్టేషన్ కు కాదు … మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫేయిల్ అని భద్రాద్రి కొత్తగూడెం

Read More »

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లాలోని 5 మునిసిపాలిటీలలో మొత్తం పోలింగ్ 82.50 శాతం నమోది నేటి గదర్ న్యూస్, ఖమ్మం: మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఖమ్మం

Read More »

ఆత్మలకు పెన్షన్లు ★ అధికారుల నిర్లక్ష్యం ★ నేటి గదర్ న్యూస్, వైరా

ఆత్మలకు పెన్షన్లు ★నేటి గదర్ న్యూస్, వైరా తెలంగాణ ప్రభుత్వంలో అర్హులకు అందాల్సిన పెన్షన్లు ఆత్మలకు ఇస్తున్నారు…ఏంటి నమ్మడం లేదా అవునండి ఇది నిజం.. ప్రతినెల నెల క్రమ తప్పకుండా మృతి చెందిన వారి

Read More »

కరకగూడెం: నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి.

నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి. *నాటు సార కాచిన,విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్ఐ పివి ఎన్ రావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని కౌలూరు, కలవలనాగారం గ్రామాల మధ్యలో

Read More »

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!

*ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు!* – *​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు* *​పుర పోరులో కాంగ్రెస్‌ ప్రభంజనం.. 80 శాతం పైగా స్థానాలు

Read More »

 Don't Miss this News !