నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 31: సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాకు వెళ్తున్న సీఐటీయూ నాయకులను ఆదివారం దమ్మపేటలో పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ బయలుదేరుతున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీఐటీయూ నాయకత్వం ఆరోపించింది. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, దీనిపై నిరసన తెలిపేందుకు శాంతియుతంగా ధర్నాకు వెళ్తున్న తమను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని నాయకులు ధ్వజమెత్తారు. సమస్యల గురించి మాట్లాడితే అరెస్టులు చేసి, అణచివేత ధోరణిని అవలంబించడం సరైంది కాదని వారు విమర్శించారు. ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలతో తమ ఆందోళనలను ఆపలేరని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Post Views: 62









