+91 95819 05907

ములకలపల్లిలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి: క్రీడల మంత్రికి ఎమ్మెల్యే జారె వినతి

నేటి గద్దర్ న్యూస్, ములకలపల్లి, ఆగస్టు, 31: ములకలపల్లి మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె మాట్లాడుతూ, ములకలపల్లి మండల యువతకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని, వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి, స్థానిక క్రీడలను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రిని కోరారు. మంత్రి శ్రీహరి ఎమ్మెల్యే జారె వినతిపై సానుకూలంగా స్పందించారని, ఈ విషయంపై త్వరలోనే పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కార్యాలయం వెల్లడించింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

 Don't Miss this News !