+91 95819 05907

మహాలక్ష్మి పథకం లో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి

మహిళలపై జరుగుతున్న దాడులు,అత్యాచారాలు అరికట్టాలి

పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కార్యదర్శి తోడెం దుర్గ డిమాండ్

మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి.ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో జమ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి తోడెం దుర్గ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ములకలపల్లి మండల పరిధిలో ముకమామిడి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం మండల మహాసభ మడకం విజయ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సభను ఉద్దేశించి డివిజన్ కార్యదర్శి తోడెం దుర్గ మాట్లాడుతూ.ఆరు గ్యారెంటీ ల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని ప్రభుత్వం ఇకనైనా స్పందించి ప్రతి మహిళా ఎకౌంట్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు మహిళలకు అన్ని విధాలుగా సమాన హక్కులు కల్పించాలని మహిళల మీద జరుగుతున్న దాడులు,అత్యాచారాలు ప్రభుత్వలు అరికట్టాలని డిమాండ్ చేశారు.గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని,గ్రామాలలో బెల్ట్ షాపులు అరికట్టి కుటుంబాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు గ్రామాలలో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మనివ్వడం సరికాదని, మద్యానికి పద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలవుతున్నాయని, ప్రభుత్వాం మాత్రం నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యిందని ప్రభుత్వాన్ని విమర్శించారు.గత వారం పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో దోమలు ప్రబలి ప్రతి ఇంటిలో విష జ్వరాల బారిన పడుతున్న ప్రభుత్వాం మాత్రం పట్టించుకోవట్లేదు.ప్రభుత్వం వైద్య అధికారులను ఆదేశించి వెంటనే గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని,ప్రతి గ్రామంలో బ్లీచింగ్ శానిటరీ,క్లీనింగ్ వంటి పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలి.ప్రతి ఇంటికి దోమతెరలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మహాసభలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్,పార్టీ మండల కార్యదర్శి కోర్సా రామకృష్ణ మాట్లాడుతూ. మహిళలను ఉద్దేశించి సమాజంలో మహిళల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని,సమాజంలో స్త్రీ పురుషులు వంటి భేదాలు లేకుండా ఇద్దరికీ సమాన హక్కులు కల్పించి మహిళలు అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చట్టాలపై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలని మాట్లాడారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ అధ్యక్షురాలు నూప సరోజిని,రైతు సంఘం మండల కార్యదర్శి ఎర్ర గొర్ల రామారావు,పౌర హక్కుల సంఘం నాయకులు బండారి నాగేంద్రబాబు మాట్లాడారు.అనంతరం నూతన కమిటీని ప్రవేశపెట్టడం జరిగింది.సంఘ అధ్యక్ష,కార్యదర్శులుగా మడకం విజయ,కల్లూరి పద్మ,ఉపాధ్యక్షులు ఇర్ఫా తులసమ్మ,సహాయ కార్యదర్శిగా మోడియం శ్యామల కోశాధికారిక తురసం భవాని ఎన్నుకోవడం జరిగింది.కమిటీ సభ్యులుగా సున్నం రమాదేవి పదం పాపమ్మ సోడే ముత్తమ్మ ఈసం శ్రీలత పొడియం పుష్ప సోయం సుహాసిని,బండారు సుహాసిని ఈర్ప జయమ్మ పాయం వెంకటమ్మ కనకం దుర్గ పద్దం శ్యామల తదితరులను మండల సభ్యురాలుగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు తాటి రత్తమ్మ మండల మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కేంద్ర రాష్ట్ర సర్కార్లు దిగి వచ్చేవరకు దశలవారీగా కార్మిక ఉద్యమాలు కొనసాగిస్తాం.

*లేబర్ కోడ్లను రద్దు చేయ్యాలి ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి* *కార్మికుల పోరాటాలకు ప్రభుత్వాలు దిగిరాక తప్పదు* నేటి గదర్‌ కరకగూడెం: 44 కార్మిక చట్టాలను తొలగించి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు మారణశాసాన్ని

Read More »

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు:మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో 44 వేలకు పైగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా‍ ‍అర్హులందరికీ న్యాయం -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్రంలో

Read More »

కార్మిక చట్టాలలో చేసిన మార్పులను రద్దు చెయ్యాలి

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను పినపాక మండలంలో కార్మిక–కర్షక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, రైతు సంక్షేమం, ప్రజా రంగ సంస్థల పరిరక్షణ వంటి అంశాలపై

Read More »

మాకు ఓటు వేయలేదు? మా కుక్కర్ లు మాకు ఇచ్చేయండి

ఓటెయ్యలేదని కుక్కర్లు వాపస్ అడిగిన నేత: అశ్వరావుపేటలో ఓటర్ల వినూత్న నిరసన మా ఆత్మగౌరవం ముఖ్యం.. కుక్కర్లు తీసుకెళ్లండి అంటూ పదో వార్డు ప్రజల ఆందోళన నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది

Read More »

Neemsticks: మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే!

మన దగ్గర ఉచితంగా దొరికే వేప పుల్లలు.. అమెరికాలో రూ.2వేల పైనే! నేటి గదర్ వెబ్ డెస్క్: ప్రకృతి ప్రసాదించిన వేప పుల్లల విలువ ఇప్పుడు విదేశాల్లో అమాంతం పెరిగిపోయింది. అమెజాన్ వంటి షాపింగ్

Read More »

అమెరికాలో చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించిన సియాటెల్ నగర యంత్రాంగం

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన కర్నూలు అమ్మాయి కుటుంబానికి రూ.262 కోట్ల భారీ పరిహారం 2023 జనవరిలో సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి(23) అనే యువతిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ కారు అనంతరం

Read More »

 Don't Miss this News !