ఆయిల్ ఫెడ్ నిర్ణయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల్లో ఆనందం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 01: ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ జూలై నెలతో పోలిస్తే ఆగష్టు నెలలో ఆయిల్ ఫామ్ గెలల ధరను భారీగా పెంచింది. ఈ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో ఆయిల్ ఫామ్ గెలల ధర టన్నుకు ₹18,052 ఉండగా, ఆగష్టు నెలలో ₹1,055 పెంచుతూ ₹19,107గా నిర్ణయించారు. ఈ ధర పెంపుతో రైతుల ఆదాయం గణనీయంగా పెరగనుంది. ముఖ్యంగా, అశ్వారావుపేట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తుండటంతో ఈ నిర్ణయం వారికి ఎంతో ఊరట కలిగించింది. గతంలో ధరలు ఆశించినంతగా లేకపోవడంతో కొంత నిరాశకు గురైన రైతులు ఇప్పుడు లాభాల బాట పట్టే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 483









