ప్రైవేట్ టీచర్లకు భీమా సౌకర్యం కల్పించాలి.
జిల్లా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రైవేట్ టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇచ్చి గౌరవించాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ టీచర్లను గుర్తించాలి
ప్రభుత్వ టీచర్లతో సమానంగా ప్రైవేటు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు టీచర్లు
ప్రైవేట్ టీచర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్
విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ టీచర్లను గుర్తించాలి.
నేటి గదర్ మెదక్ (భూపాల్ మాదిగ ) సెప్టెంబర్ 5.
ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపిటిఎఫ్) మెదక్ జిల్లా అధ్యక్షులు బాలసాయి హరిప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు బిఈడి, టిటిసి, టిపిటి, హెచ్ పి టి, పీజీ లు చదివి ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి, టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎన్నో సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు సరైన గుర్తింపు లేదని ప్రైవేట్ టేచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని విధులు నిర్వహిస్తున్న వారికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సరైన గుర్తింపునిచ్చి, ప్రైవేట్ టీచర్లకు బీమా సౌకర్యాన్ని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ప్రైవేట్ టీచర్లకు హెల్త్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. విద్యాశాఖ నిర్వహించే పరీక్షలలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు రాణించడానికి ప్రైవేట్ పాఠశాలల టీచర్లు విశేషంగా కృషి చేస్తూ సేవలందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రైవేట్ టీచర్ల సేవలను గుర్తించి వారికి సరైన గౌరవం పొందేలా కృషి చేయాలని కోరారు.









