ఉపాధ్యాయ పెన్షనర్ల అభినందన సభలో నగర మేయర్ పునుకొల్లు నీరజ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : ఉపాధ్యాయ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని పెన్షనర్స్ భవనంలో జరిగిన సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్ల అభినందన సభ జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగినది . ఈ సందర్భంగా నగర మేయర్ నీరజ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి గొప్పదని , ఎన్నో శిలలను శిల్పాలుగా మార్చి జీవితాలను త్యాగం చేసిన ఉపాధ్యాయులను ఎవరూ మర్చిపోరని , తన స్థానం మారకపోయినా తన శిష్యుని అభివృద్ధిని కోరుకునే గురువు పూజ్యుడని కొనియాడారు . ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ విద్యా రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని . ప్రభుత్వ విద్యారంగాన్ని బతికించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు రిటైర్డ్ ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు . జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నదని రిటైర్ అయిన 16 నెలలు గడిచినప్పటికీ ఉద్యోగ విరమణ ప్రయోజనాలను అందించడం లేదని డిఏలు ఇవ్వడం లేదు పిఆర్సి ని మర్చిపోయారని రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వం గురిచేస్తుందని తెలియజేశారు . జిల్లా కార్యదర్శి తాళ్లూరి వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వైఖరి పట్ల నిరసన తెలుపుతూ భవిష్యత్తులో ఆందోళన చేపట్టినట్టు తెలిపారు . అనంతరం జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్లు 20 మందిని ఘనంగా సన్మానించారు . కూసుమంచి , నేలకొండపల్లి , ఖమ్మం , వైరా , తల్లాడ , ఏన్కూరు , కల్లూరు , పెనుబల్లి , సత్తుపల్లి , మధిర ప్రాంతాల పెన్షనర్లు ఈ సత్కారంలో ఉన్నారు . కలికొండ సూర్యనారాయణ , కొండపల్లి శేఖర్ రెడ్డి , సుగుణ , రాజేంద్రన్ , లక్ష్మయ్య , ప్రభాకర్ , బాబురావు , పూర్ణచందర్రావు , నారాయణ , మోహన్ రావు , గోపయ్య , అబ్దుల్ రబ్ , దేవరాజ్ , బి కృష్ణయ్య , ప్రసాద్ , వెంకటాచార్యులు తదితర సీనియర్ ఉపాధ్యాయ పెన్షనర్లను ఈ సందర్భంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డీకే శర్మ , తాళ్లూరి వేణు , జనార్దన్ రావు , ఉపేందర్ రావు , సాంబశివరావు , దుర్గాదేవి , ఎస్ పూర్ణచందర్రావు , రాజారావు , చల్ది బాబురావు , జగన్మోహన్రావు , ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .









