నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్టులో యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్ర ప్రభ రిపోర్టర్ మోటపోతుల బాబురావుకి అరుదైన గౌరవం దక్కింది.శుక్రవారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో బాబురావుకు డాక్టరేట్ తో పాటు,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని యొక్క నేషనల్ అవార్డు అందుకున్నారు.డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లు అమెరికా ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ అవార్డులను పొందారు.ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రధాన బాధ్యులు వైస్ ఛాన్స్లర్ డాక్టర్ఆమోస్ జేమ్స్ చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వైయస్ చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిరథ మహారాజుల సమక్షంలో ఈ అవార్డులను పొందారు.ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సామాన్యుడైన నాకు ఇంత గొప్ప డాక్టరేట్ తో పాటు జాతీయ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.ఈ అవార్డులతో నా బాధ్యత మరింత పెరిగిందని రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందేందుకు కృషి చేస్తానని చెప్పారు.ఈ అవార్డులను తమ తల్లిదండ్రులకు తమ సతీమణికి తమ కుటుంబ సభ్యులకు తమ గ్రామానికి అంకితమిస్తున్నట్లు బాబురావు చెప్పారు.సహకరించిన ప్రతి ఒక్క ఆత్మీయులకు బంధువులు మిత్రులు స్నేహితుల పుర ప్రముఖులకు కృతజ్ఞతలు చెప్పారు.









