స్థానిక సంస్థలు బలోపేతం కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం) అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
నేటి గదర్ న్యూస్, వైరా:-
స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కోరారు. వైరా మండలం విప్పలమడక ఎంపీటీసీ పరిధిలోని శాఖలు విప్పలమడక, లింగన్నపాలెం పార్టీ సభ్యుల సమావేశం వైరా బోడెపూడి భవనంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న భూక్యా వీరభద్రం మాట్లాడుతూ స్థానిక సంస్థలు బలోపేతం కోసం సిపిఐ(ఎం) అనేక పోరాటాలు చేసిందని, నిధులు, విధులు, అధికారాలు స్థానిక సంస్థలకు కేటాయించాలని పార్టీ కొట్లాడుతుందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులను ప్రజలు గెలిపించారని కోరారు. సిపిఎంతో ఎన్నికలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ఎన్నికల సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కమిటీ సభ్యులు తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, బాజోజి రమణ, విప్పలమడక మాజీ సర్పంచ్ తుమ్మల జాన్ పాపయ్య, మండల కమిటీ సభ్యులు మెడా శారాబంది, బానాల కృష్ణమాచారి, షేక్ జానీ, లింగన్నపాలెం మాజీ సర్పంచ్ బాణాల వెంకట్రావమ్మ, మురళి, గరిడేపల్లి పుల్లయ్య, పుల్లయ్య, నాగేంద్ర చారి, మేరా, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









