అశ్వారావుపేట ప్రజల తరఫున మంత్రులకు కృతజ్ఞతలు: రైతులకు సేవ చేస్తానన్న సుంకపల్లి వీరభద్రరావు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామపంచాయతీలో నూతనంగా ఆత్మ కమిటీ చైర్మన్గా నియమితులైన సుంకపల్లి వీరభద్రరావుకు గ్రామంలో ఘన సన్మానం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొవ్వాసి దుర్గారావు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ తనకు ఈ ముఖ్యమైన అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తనకు దక్కిన ఈ పదవిని కేవలం పదవిగా కాకుండా రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తానని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు సహా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్నవారిలో కోడూరు శ్రీనివాసరావు, సుంకవల్లి శంకర్ బాబు, దుద్దుపూడి సతీష్, కరటూరి వాసు, సుంకువల్లి రజిని, బండారు శ్రీనివాసరావు, సత్యం రామకృష్ణ, పెనుగొండ సత్యనారాయణ, గుత్తుల సత్తిరెడ్డి, సాదు జోషి, తెల్లం రాము, మొగిలి రాంబాబు, బేతి నాగబాబు, కురుసం బాబురావు, శివ మధు, మనుగొండ కృష్ణ, మంతెన వర్మ, శాఖ చక్రధర్ రావు, నల్ల సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నూతన చైర్మన్ నియామకం పట్ల గ్రామ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సమర్థవంతమైన నాయకత్వంతో వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని ఊట్లపల్లి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









